ETV Bharat / state

'రాజీవ్​ స్వగృహ ఇళ్ల నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలి' - Medchal Malkajgiri Quthbullapur Rajiv Swagruha illu

ఆగిపోయిన రాజీవ్​ స్వగృహ ఇళ్ల నిర్మాణాలు వెంటనే పూర్తిచేయాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్​ రెడ్డి డిమాండ్​ చేశారు. పట్నంగోసలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు.​

MP Revanth Reddy
MP Revanth Reddy
author img

By

Published : Feb 27, 2020, 7:59 PM IST

రాజీవ్​ స్వగృహ ఇళ్లు 2012లోనే పూర్తి కావాల్సి ఉండగా... వాటిని తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్​రెడ్డి ఆరోపించారు. వెంటనే వాటి నిర్మాణాలను పూర్తి చేసి లబ్దిదారులకు అందించాలని డిమాండ్​ చేశారు. పట్నంగోసలో భాగంగా మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ గాజులరామారంలోని రాజీవ్ స్వగృహ ఇళ్లను మాజీ ఎమ్మెల్యే శ్రీశైలంగౌడ్​తో కలిసి ఆయన పరిశీలించారు. రూ.5 వేలు కట్టి పేర్లు నమోదు చేసుకున్న లబ్దిదారులు 13 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నా... ఇప్పటి వరకు ఇళ్ల కేటాయింపులు జరగలేదన్నారు.

పనిచేయకపోతే ఉద్యోగాలు తీసేస్తామంటున్న కేసీఆర్​, కేటీఆర్​లు ముందు తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు. అసంపూర్తిగా ఉన్న రాజీవ్ స్వగృహ ఇళ్లను అవసరమైతే పాత్రికేయులకైనా కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా దేవేందర్​నగర్, కైసర్​నగర్, డి.పోచంపల్లిలోని రెండు పడక గదుల ఇళ్లను సందర్శించారు. పనులు ఎందుకు జరగడం లేదని అధికారులను చరవాణిలో అడిగి తెలుసుకున్నారు. పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్ల బిల్లులను ఆపాలని, పెనాల్టీలను వసూలు చేయాలని చెప్పారు.

రాజీవ్​ స్వగృహ ఇళ్ల నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలి

ఇవీ చూడండి: 'అక్రమ నిర్మాణాలను తొలగించలేరా?'

రాజీవ్​ స్వగృహ ఇళ్లు 2012లోనే పూర్తి కావాల్సి ఉండగా... వాటిని తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్​రెడ్డి ఆరోపించారు. వెంటనే వాటి నిర్మాణాలను పూర్తి చేసి లబ్దిదారులకు అందించాలని డిమాండ్​ చేశారు. పట్నంగోసలో భాగంగా మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ గాజులరామారంలోని రాజీవ్ స్వగృహ ఇళ్లను మాజీ ఎమ్మెల్యే శ్రీశైలంగౌడ్​తో కలిసి ఆయన పరిశీలించారు. రూ.5 వేలు కట్టి పేర్లు నమోదు చేసుకున్న లబ్దిదారులు 13 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నా... ఇప్పటి వరకు ఇళ్ల కేటాయింపులు జరగలేదన్నారు.

పనిచేయకపోతే ఉద్యోగాలు తీసేస్తామంటున్న కేసీఆర్​, కేటీఆర్​లు ముందు తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు. అసంపూర్తిగా ఉన్న రాజీవ్ స్వగృహ ఇళ్లను అవసరమైతే పాత్రికేయులకైనా కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా దేవేందర్​నగర్, కైసర్​నగర్, డి.పోచంపల్లిలోని రెండు పడక గదుల ఇళ్లను సందర్శించారు. పనులు ఎందుకు జరగడం లేదని అధికారులను చరవాణిలో అడిగి తెలుసుకున్నారు. పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్ల బిల్లులను ఆపాలని, పెనాల్టీలను వసూలు చేయాలని చెప్పారు.

రాజీవ్​ స్వగృహ ఇళ్ల నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలి

ఇవీ చూడండి: 'అక్రమ నిర్మాణాలను తొలగించలేరా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.