ETV Bharat / state

JNTUH Golden Jubilee Celebrations: దేశంలో తొలి టెక్నాలాజీకల్ వర్సిటీ జేఎన్​టీయూహెచ్​: గవర్నర్

author img

By

Published : Oct 3, 2021, 12:46 PM IST

ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని గవర్నర్​​ తమిళిసై సౌందరరాజన్​(Governor Tamilisai Soundararajan) సూచించారు. జేఎన్​టీయూ(JNTU) హైదరాబాద్​ స్వర్ణోత్సవాలను (JNTUH Golden Jubilee Celebrations) ఆమె ప్రారంభించారు. వర్సిటీలో పూర్వ విద్యార్థుల కోసం ప్రత్యేక కేంద్రం నిర్మిస్తున్నట్లు తెలిపారు.

JNTUH GOLDEN JUBILEE CELEBRATIONS
GOVERNOR TAMILA SAI

జేఎన్టీయూకు(JNTUH Golden Jubilee Celebrations) దేశంలోనే మంచి పేరుందని గవర్నర్ తమిళిసై(Governor Tamilisai Soundararajan) ప్రశంసించారు. దేశంలోనే మొదటి టెక్నలాజికల్​ యూనివర్సిటీ జేఎన్​టీయూహెచ్​ అని గవర్నర్​ తెలిపారు. జేఎన్​టీయూ(JNTU) హైదరాబాద్​ స్వర్ణోత్సవాలను (JNTUH Golden Jubilee Celebrations) గవర్నర్​ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వర్ణోత్సవాల లోగోను ఆవిష్కరించారు.

ప్రస్తుతం ప్రతి ఒక్కటీ సాంకేతికపైనే ఆధారపడి ఉందని.. అందుకు అనుగుణంగా విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. భారత్​ నుంచి ఇతర దేశాలకు టీకాలు ఎగుమతి అవుతున్నాయంటే.. ఇలాంటి యూనివర్సిటీల నుంచి వెళ్లిన విద్యార్థుల కృషేనని గవర్నర్(Governor Tamilisai Soundararajan)​ కితాబిచ్చారు. ఈ యూనివర్సిటి పరిధిలో ఇప్పటి వరకూ 19 లక్షల మంది చదువుకున్నారన్న గవర్నర్.. పూర్వ విద్యార్థుల కోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. పూర్వ విద్యార్థులు అంటే భావితరాల ఆస్తని.. వారిందరినీ ఏకం చేస్తే మరిన్ని విజయాలు సాధించవచ్చన్నారు.

అన్ని సౌకర్యాలు ఉన్నాయ్​..

జేఎన్​టీయూ హైదరాబాద్​ స్వర్ణోత్సవ వేడుకలు గవర్నర్​ చేతుల మీదుగా జరగడం చాలా సంతోషంగా ఉందని వీసీ కట్టా నర్సింహారెడ్డి తెలిపారు. దేశంలోనే జేఎన్​టీయూహెచ్​కు మంచి పేరుందన్న వీసీ.. అనుభవిజ్ఞులైన అధ్యాపకుల వల్లనే ఇది సాధ్యమైందన్నారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు వర్సిటీలో ఉన్నాయని వీసీ తెలిపారు. ఏడాది పాటు స్వర్ణోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ 50 ఏళ్లలో ఎన్నో మైలురాళ్లు, ప్రత్యేకతలను ఈ యూనివర్సిటీ సాధించిందని వీసీ గుర్తుచేశారు.

ఇదీచూడండి: JNTUH Golden Jubilee: ఆ బాస్​లు అందరూ.. ఒకప్పుడు జేఎన్‌టీయూ విద్యార్థులేనని మీకు తెలుసా?

జేఎన్టీయూకు(JNTUH Golden Jubilee Celebrations) దేశంలోనే మంచి పేరుందని గవర్నర్ తమిళిసై(Governor Tamilisai Soundararajan) ప్రశంసించారు. దేశంలోనే మొదటి టెక్నలాజికల్​ యూనివర్సిటీ జేఎన్​టీయూహెచ్​ అని గవర్నర్​ తెలిపారు. జేఎన్​టీయూ(JNTU) హైదరాబాద్​ స్వర్ణోత్సవాలను (JNTUH Golden Jubilee Celebrations) గవర్నర్​ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వర్ణోత్సవాల లోగోను ఆవిష్కరించారు.

ప్రస్తుతం ప్రతి ఒక్కటీ సాంకేతికపైనే ఆధారపడి ఉందని.. అందుకు అనుగుణంగా విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. భారత్​ నుంచి ఇతర దేశాలకు టీకాలు ఎగుమతి అవుతున్నాయంటే.. ఇలాంటి యూనివర్సిటీల నుంచి వెళ్లిన విద్యార్థుల కృషేనని గవర్నర్(Governor Tamilisai Soundararajan)​ కితాబిచ్చారు. ఈ యూనివర్సిటి పరిధిలో ఇప్పటి వరకూ 19 లక్షల మంది చదువుకున్నారన్న గవర్నర్.. పూర్వ విద్యార్థుల కోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. పూర్వ విద్యార్థులు అంటే భావితరాల ఆస్తని.. వారిందరినీ ఏకం చేస్తే మరిన్ని విజయాలు సాధించవచ్చన్నారు.

అన్ని సౌకర్యాలు ఉన్నాయ్​..

జేఎన్​టీయూ హైదరాబాద్​ స్వర్ణోత్సవ వేడుకలు గవర్నర్​ చేతుల మీదుగా జరగడం చాలా సంతోషంగా ఉందని వీసీ కట్టా నర్సింహారెడ్డి తెలిపారు. దేశంలోనే జేఎన్​టీయూహెచ్​కు మంచి పేరుందన్న వీసీ.. అనుభవిజ్ఞులైన అధ్యాపకుల వల్లనే ఇది సాధ్యమైందన్నారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు వర్సిటీలో ఉన్నాయని వీసీ తెలిపారు. ఏడాది పాటు స్వర్ణోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ 50 ఏళ్లలో ఎన్నో మైలురాళ్లు, ప్రత్యేకతలను ఈ యూనివర్సిటీ సాధించిందని వీసీ గుర్తుచేశారు.

ఇదీచూడండి: JNTUH Golden Jubilee: ఆ బాస్​లు అందరూ.. ఒకప్పుడు జేఎన్‌టీయూ విద్యార్థులేనని మీకు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.