ETV Bharat / state

రైతులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా కృషి: మల్లారెడ్డి

మేడ్చల్​ జిల్లాలో 40 లక్షల విలువ చేసే.. రైతులకు వ్యవసాయ పరికరాలను మంత్రి మల్లారెడ్డి అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా కృషి చేస్తున్నారని మంత్రి వెల్లడించారు.

author img

By

Published : Dec 23, 2020, 3:11 PM IST

Chamakura Malla Reddy
Chamakura Malla Reddy

రైతు దినోత్సవం సందర్భంగా మేడ్చల్​ మండలంలోని ఎస్సీ, ఎస్టీ రైతులకు ఎమ్​ఎల్​ఆర్​ ఇనిస్టిట్యూట్​ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ విద్యార్థులు రూపొందించిన 40 లక్షల విలువ చేసే.. వ్యవసాయ పరికరాలను మంత్రి మల్లారెడ్డి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో అందజేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా కృషి చేస్తున్నారని మంత్రి వెల్లడించారు. ఎమ్​ఎల్​ఆర్​ సంస్థ రైతులకు పరికరాలు అందజేయడం మంచి పరిణామమని పేర్కొన్నారు.

రైతుల కోసం విద్యార్థులు వేర్వేరు కంపెనీలతో సంప్రదింపులు జరిపి.. పరికరాలు తయారు చేశారని ఎమ్​ఎల్​ఆర్​ సంస్థ అధినేత రాజశేఖర్ అన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలోని మరో 4 మండలాల్లో కోటి అరవై లక్షలతో వ్యవసాయ పరికరాలు అందజేసి చిన్న, సన్నకారు రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా తయారు చేస్తున్నట్లు తెలిపారు.

రైతు దినోత్సవం సందర్భంగా మేడ్చల్​ మండలంలోని ఎస్సీ, ఎస్టీ రైతులకు ఎమ్​ఎల్​ఆర్​ ఇనిస్టిట్యూట్​ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ విద్యార్థులు రూపొందించిన 40 లక్షల విలువ చేసే.. వ్యవసాయ పరికరాలను మంత్రి మల్లారెడ్డి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో అందజేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా కృషి చేస్తున్నారని మంత్రి వెల్లడించారు. ఎమ్​ఎల్​ఆర్​ సంస్థ రైతులకు పరికరాలు అందజేయడం మంచి పరిణామమని పేర్కొన్నారు.

రైతుల కోసం విద్యార్థులు వేర్వేరు కంపెనీలతో సంప్రదింపులు జరిపి.. పరికరాలు తయారు చేశారని ఎమ్​ఎల్​ఆర్​ సంస్థ అధినేత రాజశేఖర్ అన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలోని మరో 4 మండలాల్లో కోటి అరవై లక్షలతో వ్యవసాయ పరికరాలు అందజేసి చిన్న, సన్నకారు రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా తయారు చేస్తున్నట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.