వరద బాధితులకు అందాల్సిన సాయం అందరికి అందకపోవడమే కాకుండా అక్రమాలు చోటుచేసుకున్నాయని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ ఆరోపించారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని మూడు జోనల్ కమిషనర్ కార్యాలయాల్లో ఎంపీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించనున్నట్లు వెల్లడించారు.
ఈ నెల 5వ తేదీన ఎల్బీ నగర్, 6న మల్కాజిగిరి, 7న కూకట్పల్లి.. జీహెచ్ఎంసీ జోనల్ కార్యలయాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పిస్తామన్నారు. గ్రేటర్ పరిధిలోని వరద బాధితులకు రూ.30వేలు ఇవ్వాలనేది తమ ప్రధాన డిమాండ్గా పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ప్రమాదం: క్రేన్ ఢీకొని వ్యక్తి అక్కడిక్కడే మృతి