మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్లో గురుపూర్ణిమ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సూరారంలోని సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయానికి భక్తులు తాకిడి పెరిగింది. సాయినాథుడిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. అర్చకులు సాయిబాబాకు పాలాభిషేకం నిర్వహించారు.
ఇదీ చూడండి : రాష్ట్రవ్యాప్తంగా గురుపూర్ణిమ వేడుకలు