మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేసి, ఆహారం అందజేశారు. విపత్కర పరిస్థితుల్లో కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారని... వారి సేవలు మరువలేనివని బజరంగ్ దళ్ కార్యకర్తలు పేర్కొన్నారు. విశ్వహిందూ పరిషత్ బజరంగ్, దళ్ కార్యకర్తలు రామాయంపేటలో పది రోజులుగా రోజూ 200 మంది పేదలకు ఆహారం, నీరు, కూరగాయలు అందిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా సంఘం కార్యదర్శి పుట్టి మల్లేశం, పబ్బ సత్యనారాయణ, సంగమేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కరోనాపై ఆందోళన వద్దు.. ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు!