మెదక్ జిల్లా నర్సాపూర్ పురపాలిక సంఘ నూతన భవన నిర్మాణానికి రూ. 2 కోట్ల నిధులు మంజూరు అయినట్లు మున్సిపల్ ఛైర్మన్ మురళి యాదవ్ తెలిపారు. దీంతో నూతన భవనం నిర్మాణానికి చర్యలను ముమ్మరం చేశారు. ప్రస్తుత పాత భవనంలోని దస్త్రాలు, ఇతర సామగ్రిని పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి మార్చారు. భవన కూల్చివేత ప్రక్రియ ప్రారంభించారు. నూతన భవనంలో అన్ని వసతులు ఉండేవిధంగా నిర్మాణం చేస్తున్నట్లు వివరించారు.
ఇవీ చూడండి: తెలంగాణ జనాభా 3 కోట్ల 72 లక్షల 10వేలు..