కరోనా కట్టడికి ఎట్టకేలకు రాష్ట్ర సర్కార్ లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. బుధవారం ఉదయం 10 గంటల నుంచి లాక్డౌన్ మొదలవ్వనున్నందున మద్యంప్రియులు వైన్ షాపుల వద్దకు పరుగులు తీశారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన మందుబాబులతో మద్యం దుకాణాలు కిక్కిరిసిపోయాయి.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏ వైన్ షాపు చూసినా.. మందు బాబులతో కిటకిటలాడింది. మద్యం కొనుగోళ్ల హడావుడిలో ముఖానికి మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కరోనా నిబంధనలను ప్రజలు తుంగలోతొక్కారు. కొన్ని చోట్ల మద్యం కోసం తోపులాటలు కూడా చోటుచేసుకున్నాయి.
- ఇదీ చదవండి ' ఆ సమయంలో మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయి'