రంజాన్ పండుగను పురస్కరించుకొని మెదక్ పట్టణంలోని జీకేఆర్ ఫంక్షన్ హాల్లో ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుకలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన తొలి పండగే రంజాన్ అన్నారు. మహిళలందరికీ బట్టల పంపిణీ చేసి... ఇఫ్తార్ విందు ఇవ్వడం ప్రభుత్వం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. నాలుగేళ్ల నుంచి మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ మల్లికార్జున్ గౌడ్, కౌన్సిలర్లు, తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: విభజన హమీల అమలుకు పోరాడుతాం..