ETV Bharat / state

కరోనా పరీక్షలు చేయించుకున్న పద్మాదేవేందర్​ రెడ్డి దంపతులు - mla padmadevender reddy latest news

మెదక్​ ఎమ్మెల్యే పద్మాదేవేందర్​ రెడ్డి దంపతులతో పాటు వారి కార్యాలయ సిబ్బంది కరోనా పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో వారికి నెగెటివ్​ వచ్చినట్లు ఎమ్మెల్యే చెప్పారు. శాసనసభ సమావేశాలు ఉన్నందున స్పీకర్​ సూచనతో టెస్ట్​ చేయించుకున్నట్లు తెలిపారు.

Padmadevender Reddy couple who underwent corona tests in medak
కరోనా పరీక్షలు చేయించుకున్న పద్మాదేవేందర్​ రెడ్డి దంపతులు
author img

By

Published : Sep 6, 2020, 3:30 PM IST

శాసనసభ సమావేశాలు ఈ నెల7 నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాలకు హాజరయ్యే వారందరూ కరోనా పరీక్ష తప్పకుండా చేసుకోవాలనే నిబంధనతోపాటు స్పీకర్ సూచన మేరకు మెదక్​ ఎమ్మెల్యే పద్మాదేవేందర్​ రెడ్డి దంపతులు కరోనా పరీక్షలు చేయించుకున్నారు.

వారితో పాటు వారి కార్యాలయ సిబ్బంది కూడా కొవిడ్​ టెస్ట్​ చేయించుకున్నారు. పరీక్షల్లో వీరందరికీ నెగెటివ్ వచ్చినట్లు ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి తెలిపారు. అత్యవసరమైతే బయటకు వెళ్లాలని, ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కు ధరించాలన్నారు. వివాహ వేడుకలకు దూరంగా ఉండాలని కోరారు.

శాసనసభ సమావేశాలు ఈ నెల7 నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాలకు హాజరయ్యే వారందరూ కరోనా పరీక్ష తప్పకుండా చేసుకోవాలనే నిబంధనతోపాటు స్పీకర్ సూచన మేరకు మెదక్​ ఎమ్మెల్యే పద్మాదేవేందర్​ రెడ్డి దంపతులు కరోనా పరీక్షలు చేయించుకున్నారు.

వారితో పాటు వారి కార్యాలయ సిబ్బంది కూడా కొవిడ్​ టెస్ట్​ చేయించుకున్నారు. పరీక్షల్లో వీరందరికీ నెగెటివ్ వచ్చినట్లు ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి తెలిపారు. అత్యవసరమైతే బయటకు వెళ్లాలని, ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కు ధరించాలన్నారు. వివాహ వేడుకలకు దూరంగా ఉండాలని కోరారు.

ఇదీ చదవండి: శత్రువు కన్నుగప్పి సరిహద్దుకు చేర్చే రహదారి సిద్ధం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.