మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో గల ఖాజీగల్లీ ఏడవ వార్డు నుంచి పోటీ చేస్తున్న ఎంఐఎం అభ్యర్థి రియాజ్కు మద్దతుగా ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగానే రియాజ్ ఇంట్లోకి వెళ్లి కాసేపు ఆయనతో మాట్లాడారు. గెలుపుకోసం కృషి చేయాలని బరిలో నిలిచిన అభ్యర్థికి సూచించారు. అనంతరం హైదరాబాద్ వెళ్లారు. చౌరస్తా నుంచి ఖాజీగల్లీ వరకు అసద్ను యువకులు భారీ ర్యాలీగా తీసుకువెళ్లారు.
ఇవీ చూడండి: కొనసాగుతున్న తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం