ETV Bharat / state

ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోండి: కలెక్టర్

author img

By

Published : May 22, 2021, 8:10 PM IST

వైద్యాధికారులు, అన్ని మండలాల తహసీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండో విడత జ్వరసర్వే.. లాక్​డౌన్​ అమలు, ఉపాధి హామీ పథకం అమలుపై సమీక్షించారు.

medak district collector
medak district collector

మెదక్​ జిల్లాలో పకడ్భందీగా లాక్​డౌన్​ అమలుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ హరీశ్​.. తహసీల్దార్లు, అధికారులకు సూచించారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు లాక్​డౌన్​ సడలింపు ఉన్నా.. చాలా మంది నిబంధనలు పాటించకపోవడం వల్ల కొవిడ్ వ్యాప్తి చెందుతుందని అన్నారు.

ప్రతి షాపు దగ్గర గుంపులు గుంపులుగా జనం ఉండకుండా చూడాలని సూచించారు. నిబంధనలు ఉల్లఘించిన దుకాణ యజమానులపై కేసు నమోదు చేయడంతో పాటు.. దుకాణం సీజ్​ చేయాలని తెలిపారు.

శనివారం వైద్యాధికారులతో పాటు.. అన్ని మండలాల తహసీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్​లో రెండో విడత జ్వరసర్వే.. లాక్​డౌన్​ అమలు, ఉపాధి హామీ పథకం అమలుపై సమీక్షించారు.

లాక్​డౌన్ వల్ల రెవెన్యూ రాబడి తగ్గుతున్నా... ప్రజల ప్రాణాలను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వం లాక్​డౌన్ అమలు చేస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. కొందరు సమయం మించిన తర్వాత రోడ్డుపై తిరుగుతున్నారని అన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇదీ చదవండి: 'బ్లాక్ ఫంగస్​ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే.. ముప్పు తక్కువ'

మెదక్​ జిల్లాలో పకడ్భందీగా లాక్​డౌన్​ అమలుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ హరీశ్​.. తహసీల్దార్లు, అధికారులకు సూచించారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు లాక్​డౌన్​ సడలింపు ఉన్నా.. చాలా మంది నిబంధనలు పాటించకపోవడం వల్ల కొవిడ్ వ్యాప్తి చెందుతుందని అన్నారు.

ప్రతి షాపు దగ్గర గుంపులు గుంపులుగా జనం ఉండకుండా చూడాలని సూచించారు. నిబంధనలు ఉల్లఘించిన దుకాణ యజమానులపై కేసు నమోదు చేయడంతో పాటు.. దుకాణం సీజ్​ చేయాలని తెలిపారు.

శనివారం వైద్యాధికారులతో పాటు.. అన్ని మండలాల తహసీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్​లో రెండో విడత జ్వరసర్వే.. లాక్​డౌన్​ అమలు, ఉపాధి హామీ పథకం అమలుపై సమీక్షించారు.

లాక్​డౌన్ వల్ల రెవెన్యూ రాబడి తగ్గుతున్నా... ప్రజల ప్రాణాలను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వం లాక్​డౌన్ అమలు చేస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. కొందరు సమయం మించిన తర్వాత రోడ్డుపై తిరుగుతున్నారని అన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇదీ చదవండి: 'బ్లాక్ ఫంగస్​ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే.. ముప్పు తక్కువ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.