వాయుగుండం ప్రభావంతో మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో భారీ వర్షం కురిసింది.పట్టణంలోని పలు కాలనీలు జలమయం అయ్యాయి. మున్సిపల్ ఛైర్మన్ మురళి యాదవ్, కమిషనర్ రమణమూర్తి కాలనీల్లో పర్యటిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షించారు.
జలమయం
జాతీయ రహదారి నిర్మాణంలో పనిచేసే కూలీలకు నర్సాపూర్-హైదరాబాద్ రహదారి పక్కన ఏర్పాటు చేసిన తాత్కాలిక నివాసాలు జలమయం అయ్యాయి. ఇళ్లలోని సామాగ్రి అంతా నీటిపాలయ్యింది. స్థానికులను ఇతర ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు రహదారి నిర్మాణ గుత్తేదార్లు చెప్పారు.
ఇదీ చదవండి: లాలాపేటలో ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న నాలా