ఇంట్లో ఉంటూ మహిళలకు చేదోడు వాదోడుగా పనుల్లో సహకరించాలని మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి కోరారు. నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఇంటి పనులు చేసుకోవడంలో తప్పు లేదని వారు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ప్రజలను అన్ని రకాలుగా ఆదుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సునీతా రెడ్డి, జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: నీళ్లు ఎక్కువ తాగితే బరువు తగ్గుతారా?