ETV Bharat / state

రోడ్డెక్కిన అన్నదాతలు.. ధాన్యానికి నిప్పు - రైతుల ధర్నా వార్తలు రామయంపల్లి

ధాన్యంలో పొల్లు ఉందని రైస్​ మిల్ యజమాని ధాన్యాన్ని తిరిస్కరించినందుకు అన్నదాతలు ధర్నా బాట పట్టారు. ఆవేదనతో ధాన్యానికి నిప్పుపెట్టారు. సన్న రకం ధాన్యానికి రూ. 2,500 మద్దతు ధర కల్పించాలని డిమాండ్​ చేశారు. వీరికి సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశ్​ సంఘీభావం తెలిపారు.

రోడ్డెక్కిన అన్నదాతలు.. ధాన్యానికి నిప్పు
రోడ్డెక్కిన అన్నదాతలు.. ధాన్యానికి నిప్పు
author img

By

Published : Nov 20, 2020, 3:50 PM IST

మెదక్ జిల్లా చిన్న శంకరం పేట మండలం రామయంపల్లి గ్రామంలో రైతులు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. రైస్ మిల్ యజమాని ఐకేపీ ధాన్యంలో పొల్లు ఉందని లారీలో ఉన్న ధాన్యాన్ని తిరస్కరించినందుకు ధర్నా చేపట్టారు. అనంతరం ధాన్యానికి నిప్పుపెట్టారు.

సన్న ధాన్యానికి రూ. 2,500 గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్​ చేశారు. వీరికి సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశ్​ సంఘీభావం తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను సన్న రకం సాగు చేయించి వరి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తానని చెప్పి మద్దతు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. తాను మాత్రం తన ఫాంహౌస్​లో దొడ్డు రకం ధాన్యాన్ని పండించి కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకున్నారని ఆరోపించారు. మరి తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

ఇకనైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ధాన్యానికి రూ. 2,500 మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని.. లేకుంటే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: సన్నరకం ధాన్యానికి మద్దతు ధర కల్పించాలంటూ రైతుల ఆందోళన

మెదక్ జిల్లా చిన్న శంకరం పేట మండలం రామయంపల్లి గ్రామంలో రైతులు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. రైస్ మిల్ యజమాని ఐకేపీ ధాన్యంలో పొల్లు ఉందని లారీలో ఉన్న ధాన్యాన్ని తిరస్కరించినందుకు ధర్నా చేపట్టారు. అనంతరం ధాన్యానికి నిప్పుపెట్టారు.

సన్న ధాన్యానికి రూ. 2,500 గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్​ చేశారు. వీరికి సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశ్​ సంఘీభావం తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను సన్న రకం సాగు చేయించి వరి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తానని చెప్పి మద్దతు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. తాను మాత్రం తన ఫాంహౌస్​లో దొడ్డు రకం ధాన్యాన్ని పండించి కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకున్నారని ఆరోపించారు. మరి తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

ఇకనైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ధాన్యానికి రూ. 2,500 మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని.. లేకుంటే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: సన్నరకం ధాన్యానికి మద్దతు ధర కల్పించాలంటూ రైతుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.