ETV Bharat / state

'తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి' - medak bjp news

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్​ చేస్తూ బీజైవైఎం జిల్లా శాఖ ఆధ్వర్యంలో మెదక్​ పట్టణంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణ విమోచన పోరాటాన్ని పాఠ్యాంశంగా చేర్చడమే కాకుండా... పోరాటం జరిగిన స్థలాలను స్మృతి కేంద్రాలుగా తీర్చిదిద్దాలని డిమాండ్​ చేశారు.

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారకంగా చేయాలని బీజేవైఎం డిమాండ్​
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారకంగా చేయాలని బీజేవైఎం డిమాండ్​
author img

By

Published : Sep 16, 2020, 9:32 AM IST

మెదక్​ పట్టణంలో బీజేవైఎం ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. సెప్టెంబర్​17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్​ చేశారు.

తెరాస సర్కారు మెజారిటీ ప్రజలను విస్మరిస్తూ... నిజాం తరహా పాలన చేస్తోందని మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ఆరోపించారు. హైదరాబాద్​ సంస్థానం నుంచి విమోచనం పొంది మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో విలీనమైన జిల్లాలలో ఆయా ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తుంటే తెలంగాణలో నిర్వహించకపోవడం దారుణమన్నారు. విమోచన దినోత్సవాన్ని అధికారకంగా నిర్వహించాలని భాజపా తరఫున డిమాండ్​ చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పట్లొళ్ల శశిధర్ రెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ ఇంఛార్జి సింగాయిపల్లి గోపి పాల్గొన్నారు.

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారకంగా చేయాలని బీజేవైఎం డిమాండ్​
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారకంగా చేయాలని బీజేవైఎం కాగడాల ర్యాలీ

ఇదీ చూడండి: గోదావరి -కావేరి అనుసంధానంపై రాష్ట్రాలతో 18న కేంద్రం చర్చ

మెదక్​ పట్టణంలో బీజేవైఎం ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. సెప్టెంబర్​17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్​ చేశారు.

తెరాస సర్కారు మెజారిటీ ప్రజలను విస్మరిస్తూ... నిజాం తరహా పాలన చేస్తోందని మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ఆరోపించారు. హైదరాబాద్​ సంస్థానం నుంచి విమోచనం పొంది మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో విలీనమైన జిల్లాలలో ఆయా ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తుంటే తెలంగాణలో నిర్వహించకపోవడం దారుణమన్నారు. విమోచన దినోత్సవాన్ని అధికారకంగా నిర్వహించాలని భాజపా తరఫున డిమాండ్​ చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పట్లొళ్ల శశిధర్ రెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ ఇంఛార్జి సింగాయిపల్లి గోపి పాల్గొన్నారు.

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారకంగా చేయాలని బీజేవైఎం డిమాండ్​
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారకంగా చేయాలని బీజేవైఎం కాగడాల ర్యాలీ

ఇదీ చూడండి: గోదావరి -కావేరి అనుసంధానంపై రాష్ట్రాలతో 18న కేంద్రం చర్చ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.