మంచిర్యాల జిల్లా కేంద్రంలో వికాస తరంగిణి భవన నిర్మాణానికి చిన జీయర్ స్వామి భూమి పూజ చేశారు. స్థానిక పురోహితులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. జిల్లాలో వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్లుగా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సంస్థ సభ్యులు తెలిపారు. గోదావరి రోడ్డులో జరుగుతున్న శ్రీనివాస కల్యాణానికి విచ్చేసిన జీయర్ స్వామి తమ భవన నిర్మాణ పనులను ప్రారంభించడం పట్ల సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి :ఏ భాషలోనైనా పంపొచ్చు..!