ETV Bharat / state

జంతు కళేబరాల ఖననంపై అవగాహన.. వారణాసి వరకు సైకిల్​ యాత్ర - mancherial district news

రోడ్డుపై ప్రతిరోజూ ఎన్నో ప్రమాదాలను చూస్తూ ఉంటాం. వాటి గురించి వింటూ ఉంటాం. వాటిలో తరచుగా అడవి నుంచి బయటకు వచ్చిన జంతువులు పదుల కొద్దీ మృత్యువాత పడుతుంటాయి. వాటి గురించి పట్టించుకునే నాథుడే ఉండడు. అవి అలాగే రోడ్డుపై పడి ఉండటం వల్ల వాటి నుంచి వచ్చే దుర్వాసన ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తుంది. ఈ సమస్యపై అవగాహన పెంచేందుకు మంచిర్యాలకు చెందిన వ్యక్తి నడుం బిగించాడు.

friends animal trust cycle tour
ఫ్రెండ్స్​ యానిమల్​ ట్రస్ట్ సైకిల్​ యాత్ర
author img

By

Published : Jun 27, 2021, 1:14 PM IST

రహదారులపై ప్రమాదాలతో మృత్యువాత పడుతున్న జంతువుల కళేబరాలను ఖననం చేయాలనే ఉద్దేశంతో మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఫ్రెండ్స్ యానిమల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సైకిల్​ యాత్ర చేపట్టారు. ట్రస్ట్​ నిర్వాహకుడు సందేశ్ గుప్తా, అతని స్నేహితుడు నరేష్ సైకిల్​పై వారణాసి వరకు యాత్రగా బయలుదేరారు. యాత్రి దిగ్విజయంగా కొనసాగాలని స్థానికులు హనుమాన్ ఆలయంలో పూజలు చేసి వీడ్కోలు పలికారు. మరికొంతమంది యాత్రకు ఆర్థిక సాయం అందించారు.

ప్రధాన రహదారులపై వాహనాలు ఢీకొని పశువులు, జంతువులు అక్కడికక్కడే మృతి చెందుతున్నాయి. మనం కనీస బాధ్యతగా కూడా చూడటం లేదు. రహదారులపై చనిపోయిన జంతు కళేబరాలను వదిలి వెళ్లడం వల్ల పశువులకు, వాహనదారులకు ఇబ్బంది కలుగుతుంది. ఆ ఉద్దేశంతోనే ఈ యాత్ర చేపట్టాం.

-సందేశ్​ గుప్తా, ఫ్రెండ్స్​ యానిమల్​ ట్రస్ట్​ నిర్వాహకుడు, మంచిర్యాల

నెల రోజుల పాటు

జాతీయ రహదారి వెంట మంచిర్యాల నుంచి యూపీలోని వారణాసి వరకు 30 రోజులపాటు 25 వందల కిలోమీటర్ల సైకిల్ యాత్రను నిర్వహిస్తున్నామని సందేశ్​ గుప్తా తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో తన యాత్ర గురించి తెలుసుకున్న జగిత్యాల జిల్లా మెట్​పల్లికి చెందిన నరేష్ స్వచ్ఛందంగా తనతో పాటు పాల్గొంటున్నారని తెలిపారు. జంతు కళేబరాలను తామే స్వచ్ఛందంగా ఖననం చేస్తామని తెలిపారు. తమ యానిమల్ ట్రస్టు ద్వారా అడవుల్లో ఆహారం లేక అలమటిస్తున్న వానరాలకు పండ్లను అందించామని సందేశ్​ గుప్తా తెలిపారు. జంతు ప్రేమికుడిగా స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

జంతు ప్రేమికుడిగా స్వచ్ఛంద కార్యక్రమాలు: సందేశ్​ గుప్తా

ఇదీ చదవండి: ఎస్సీ సాధికారతపై అఖిలపక్ష సమావేశం ప్రారంభం

రహదారులపై ప్రమాదాలతో మృత్యువాత పడుతున్న జంతువుల కళేబరాలను ఖననం చేయాలనే ఉద్దేశంతో మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఫ్రెండ్స్ యానిమల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సైకిల్​ యాత్ర చేపట్టారు. ట్రస్ట్​ నిర్వాహకుడు సందేశ్ గుప్తా, అతని స్నేహితుడు నరేష్ సైకిల్​పై వారణాసి వరకు యాత్రగా బయలుదేరారు. యాత్రి దిగ్విజయంగా కొనసాగాలని స్థానికులు హనుమాన్ ఆలయంలో పూజలు చేసి వీడ్కోలు పలికారు. మరికొంతమంది యాత్రకు ఆర్థిక సాయం అందించారు.

ప్రధాన రహదారులపై వాహనాలు ఢీకొని పశువులు, జంతువులు అక్కడికక్కడే మృతి చెందుతున్నాయి. మనం కనీస బాధ్యతగా కూడా చూడటం లేదు. రహదారులపై చనిపోయిన జంతు కళేబరాలను వదిలి వెళ్లడం వల్ల పశువులకు, వాహనదారులకు ఇబ్బంది కలుగుతుంది. ఆ ఉద్దేశంతోనే ఈ యాత్ర చేపట్టాం.

-సందేశ్​ గుప్తా, ఫ్రెండ్స్​ యానిమల్​ ట్రస్ట్​ నిర్వాహకుడు, మంచిర్యాల

నెల రోజుల పాటు

జాతీయ రహదారి వెంట మంచిర్యాల నుంచి యూపీలోని వారణాసి వరకు 30 రోజులపాటు 25 వందల కిలోమీటర్ల సైకిల్ యాత్రను నిర్వహిస్తున్నామని సందేశ్​ గుప్తా తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో తన యాత్ర గురించి తెలుసుకున్న జగిత్యాల జిల్లా మెట్​పల్లికి చెందిన నరేష్ స్వచ్ఛందంగా తనతో పాటు పాల్గొంటున్నారని తెలిపారు. జంతు కళేబరాలను తామే స్వచ్ఛందంగా ఖననం చేస్తామని తెలిపారు. తమ యానిమల్ ట్రస్టు ద్వారా అడవుల్లో ఆహారం లేక అలమటిస్తున్న వానరాలకు పండ్లను అందించామని సందేశ్​ గుప్తా తెలిపారు. జంతు ప్రేమికుడిగా స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

జంతు ప్రేమికుడిగా స్వచ్ఛంద కార్యక్రమాలు: సందేశ్​ గుప్తా

ఇదీ చదవండి: ఎస్సీ సాధికారతపై అఖిలపక్ష సమావేశం ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.