భూ క్రమబద్ధీకరణపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ మంచిర్యాల జిల్లా నస్పూర్ పురపాలక కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలలో ఎల్ఆర్ఎస్ విషయంలోముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జీవోలను అమలు చేస్తూ.. రూ. పది వేల కోట్లను పేద, మధ్యతరగతి ప్రజల పైన పెను భారం మోపుతున్నారన్నారు.
ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని సీపీఐ నేతలు ఆరోపించారు. సామాన్య ప్రజలు రెండు గుంటల భూమిని కొనుగోలు చేస్తే క్రమబద్ధీకరణ పేరుతో సుమారు రూ. లక్ష ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తోందన్నారు. కరోనా కష్టకాలంలో ఇంటి కిరాయి కట్టవద్దని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్ఆర్ఎస్ ద్వారా డబ్బులు చెల్లించాలని ఏ పద్ధతి ప్రకారం అడుగుతున్నారని భారత కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు ప్రశ్నించారు.
ఇదీ చదవండి: ఆదిలాబాద్లో వీధి వ్యాపారుల నిరసన