మహబూబ్నగర్ జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హరితహారంలో భాగంగా జిల్లా కేంద్రంలోని సుభాష్ చంద్రబోస్ చౌరస్తా నుంచి రైల్వే స్టేషన్ వరకు నూతనంగా ఏర్పాటు చేసిన రహదారిలో మొక్కలు నాటారు. పాలమూరు పట్టణాన్ని సుందరీకరణ చేయనున్నామని.. అందుకు ప్రజలు సహకరించాలని కోరారు. పాలమూరు రూపురేఖలను మార్చి హైదరాబాద్కు ధీటుగా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ రోనాల్డ్ రోస్ పాల్గొన్నారు.
ఇవీచూడండి: నియోజకవర్గ అభివృద్ధి నిధులకు బ్రేక్?