ETV Bharat / state

కేసీఆర్​ను విమర్శిస్తే ఊరుకోం: శ్రీనివాస్​ గౌడ్

సీఎం కేసీఆర్​ను ఎంపీ జితేందర్ రెడ్డి విమర్శించడం పట్ల ఆ పార్టీ పాలమూరు ఎమ్మెల్యేలు స్పందించారు. జితేందర్ రెడ్డిని పార్టీలో గౌరవంగా చూసుకున్నామని... పార్టీ మారగానే కేసీఆర్​ను విమర్శించడం సరికాదన్నారు.

author img

By

Published : Mar 29, 2019, 3:36 PM IST

Updated : Mar 29, 2019, 4:50 PM IST

కేసీఆర్​ను విమర్శిస్తే ఊరుకోబోం : మంత్రి శ్రీనివాస్ గౌడ్

జితేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వనందుకు కేసీఆర్​ను విమర్శిస్తే ఊరుకోబోమని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. జితేందర్ రెడ్డిని పార్టీలో గౌరవంగా చూసుకున్నామని.. పార్టీ మారగానే కేసీఆర్​ను విమర్శించడం సరికాదన్నారు. పాలమూరులో ఈ నెల 31న జరగనున్న సీఎం సభకు జనం భారీగా హాజరు కావాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు. జాతీయ స్థాయిలో తెరాస సహా ఇతర ఎంపీల మద్దతుతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా సాధిస్తామని చెప్పారు. మోదీ సభలో హామీలు, పథకాలతో మభ్యపెట్టే ప్రయత్నం చేసినా జనం నమ్మే స్థితిలో లేరన్నారు.

ఈ నెల 31న జరగనున్న కేసీఆర్ సభకు జనం భారీగా హాజరు కావాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్

జితేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వనందుకు కేసీఆర్​ను విమర్శిస్తే ఊరుకోబోమని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. జితేందర్ రెడ్డిని పార్టీలో గౌరవంగా చూసుకున్నామని.. పార్టీ మారగానే కేసీఆర్​ను విమర్శించడం సరికాదన్నారు. పాలమూరులో ఈ నెల 31న జరగనున్న సీఎం సభకు జనం భారీగా హాజరు కావాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు. జాతీయ స్థాయిలో తెరాస సహా ఇతర ఎంపీల మద్దతుతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా సాధిస్తామని చెప్పారు. మోదీ సభలో హామీలు, పథకాలతో మభ్యపెట్టే ప్రయత్నం చేసినా జనం నమ్మే స్థితిలో లేరన్నారు.

ఈ నెల 31న జరగనున్న కేసీఆర్ సభకు జనం భారీగా హాజరు కావాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఇవీ చూడండి :''మోదీ వస్తారని 500 ఏళ్ల ముందే తెలుసు''



Last Updated : Mar 29, 2019, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.