ETV Bharat / state

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి శ్రీనివాస్​గౌడ్​

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎక్సైజ్​ శాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్​ తెలిపారు. మహబూబ్​నగర్​ జిల్లా కొడంగల్​ మండలం నర్సాపూర్​, హుస్నాబాద్​ గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందన్నారు.

author img

By

Published : Apr 29, 2020, 2:23 PM IST

మంత్రి శ్రీనివాస్​ గౌడ్​
మంత్రి శ్రీనివాస్​ గౌడ్​

రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎక్సైజ్​శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. మహబూబ్​నగర్​ జిల్లా కొడంగల్ మండలం నర్సాపూర్, హస్నాబాద్ గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఎన్నో దేశాల ప్రజలు కరోనా ధాటికి ఆకలితో అలమటిస్తుంటే తెలంగాణలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మూడు పూటలా భోజనం చేస్తున్నారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతుల గురించి తీసుకున్న నిర్ణయాలే దీనికి కారణమని పేర్కొన్నారు. త్వరలోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి వలసల జిల్లాను బంగారు పంటలు పండే జిల్లాగా మారుస్తామన్నారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, ఎంపీపీ ముదప్ప దేశ్​ముఖ్​, జడ్పీటీసీ నాగరాణి, పలు శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎక్సైజ్​శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. మహబూబ్​నగర్​ జిల్లా కొడంగల్ మండలం నర్సాపూర్, హస్నాబాద్ గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఎన్నో దేశాల ప్రజలు కరోనా ధాటికి ఆకలితో అలమటిస్తుంటే తెలంగాణలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మూడు పూటలా భోజనం చేస్తున్నారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతుల గురించి తీసుకున్న నిర్ణయాలే దీనికి కారణమని పేర్కొన్నారు. త్వరలోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి వలసల జిల్లాను బంగారు పంటలు పండే జిల్లాగా మారుస్తామన్నారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, ఎంపీపీ ముదప్ప దేశ్​ముఖ్​, జడ్పీటీసీ నాగరాణి, పలు శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి:తస్మాత్​ జాగ్రత్త.. మురుగునీటి పైపులు ద్వారా కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.