రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ మండలం నర్సాపూర్, హస్నాబాద్ గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఎన్నో దేశాల ప్రజలు కరోనా ధాటికి ఆకలితో అలమటిస్తుంటే తెలంగాణలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మూడు పూటలా భోజనం చేస్తున్నారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల గురించి తీసుకున్న నిర్ణయాలే దీనికి కారణమని పేర్కొన్నారు. త్వరలోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి వలసల జిల్లాను బంగారు పంటలు పండే జిల్లాగా మారుస్తామన్నారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, ఎంపీపీ ముదప్ప దేశ్ముఖ్, జడ్పీటీసీ నాగరాణి, పలు శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి:తస్మాత్ జాగ్రత్త.. మురుగునీటి పైపులు ద్వారా కరోనా