మహబూబ్నగర్ జిల్లా తిరుమలాపూర్ గ్రామంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ రాష్ట్ర సభ్యులు చిలకమర్రి నరసింహులు పర్యటించారు. ఇటీవల లారీ ఢీకొని మృతి చెందిన నరసింహులు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు సూచించారు.
నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయాలని డీఎస్పీ శ్రీధర్ను ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణా, కృత్రిమ తయారీ కేంద్రాలు నామరూపాలు లేకుండా చేయాలని అధికారులకు సూచించారు.
ఇవీ చూడండి: 'మూడు తరాలుగా సాగిన ఉద్యమానికి ఆయన ప్రత్యక్ష సాక్షి'