ETV Bharat / state

RPF constable rescued woman : రెప్పపాటులో మహిళను కాపాడిన ఆర్పీఎఫ్​ కానిస్టేబుల్​ - మహబూబ్​నగర్​ రైల్వే స్టేషన్​లో మహిళ ఆత్మహత్యాయత్నం

RPF constable rescued woman : కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకోడానికి రైలుకింద పడబోయిన ఓ మహిళను ఆర్పీఎఫ్​ కానిస్టేబుల్​ రక్షించింది. ఈ ఘటన మహబూబ్​నగర్​ రైల్వేస్టేషన్​లో జరిగింది. ఈనెల 7న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

RPF constable rescued woman
RPF constable rescued woman
author img

By

Published : Jan 9, 2022, 5:28 PM IST

రెప్పపాటులో మహిళను కాపాడిన ఆర్పీఎఫ్​ కానిస్టేబుల్​

RPF constable rescued woman : కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై... ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించిన ఓ మహిళను.. ఆర్పీఎఫ్​ కానిస్టేబుల్​ కాపాడింది. ఈనెల 7న మహబూబ్​నగర్​ రైల్వే స్టేషన్​లో జరిగిన ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం మోతీనగర్ వార్డుకు చెందిన యాదమ్మ(40) కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది... ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఈ క్రమంలో ఈనెల 7న మహబూబ్​నగర్ రైల్వేస్టేషన్​ వచ్చింది. ఏపీ నుంచి దిల్లీ వెళ్తున్న సంపర్క్​క్రాంతి ఎక్స్​ప్రెస్​... స్టేషన్​కు సమీపిస్తున్న సమయంలో ఒక్కసారిగా ట్రాక్​మీదకు వెళ్లి నిలబడింది.

అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆర్పీఎఫ్​ కానిస్టేబుల్ పూనమ్​...​ ఆమెను గుర్తించి పక్కకు లాగేయడంతో ప్రాణాలతో బయటపడింది. పట్టాలపై మహిళను గుర్తించిన లోకోపైలట్​ అత్యవసర పరిస్థితిలో రైలును నిలిపేశారు. అనంతరం 25 నిమిషాల ఆలస్యంగా రైలు బయలుదేరి వెళ్లింది. యాదమ్మను అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు... ఆమెకు కౌన్సెలింగ్​ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. రెప్పపాటులో మహిళను కాపాడిన ఆర్పీఎస్​ కానిస్టేబుల్​ పూనమ్​ను రైల్వే సిబ్బంది, అధికారులు అభినందించారు.

ఇదీ చూడండి: కదులుతున్న రైలు నుంచి దిగబోయి..

రెప్పపాటులో మహిళను కాపాడిన ఆర్పీఎఫ్​ కానిస్టేబుల్​

RPF constable rescued woman : కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై... ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించిన ఓ మహిళను.. ఆర్పీఎఫ్​ కానిస్టేబుల్​ కాపాడింది. ఈనెల 7న మహబూబ్​నగర్​ రైల్వే స్టేషన్​లో జరిగిన ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం మోతీనగర్ వార్డుకు చెందిన యాదమ్మ(40) కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది... ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఈ క్రమంలో ఈనెల 7న మహబూబ్​నగర్ రైల్వేస్టేషన్​ వచ్చింది. ఏపీ నుంచి దిల్లీ వెళ్తున్న సంపర్క్​క్రాంతి ఎక్స్​ప్రెస్​... స్టేషన్​కు సమీపిస్తున్న సమయంలో ఒక్కసారిగా ట్రాక్​మీదకు వెళ్లి నిలబడింది.

అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆర్పీఎఫ్​ కానిస్టేబుల్ పూనమ్​...​ ఆమెను గుర్తించి పక్కకు లాగేయడంతో ప్రాణాలతో బయటపడింది. పట్టాలపై మహిళను గుర్తించిన లోకోపైలట్​ అత్యవసర పరిస్థితిలో రైలును నిలిపేశారు. అనంతరం 25 నిమిషాల ఆలస్యంగా రైలు బయలుదేరి వెళ్లింది. యాదమ్మను అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు... ఆమెకు కౌన్సెలింగ్​ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. రెప్పపాటులో మహిళను కాపాడిన ఆర్పీఎస్​ కానిస్టేబుల్​ పూనమ్​ను రైల్వే సిబ్బంది, అధికారులు అభినందించారు.

ఇదీ చూడండి: కదులుతున్న రైలు నుంచి దిగబోయి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.