ETV Bharat / state

మళ్లీ పెరుగుతోన్న ఉల్లి ధరలు... రైతులకు ఊరట

author img

By

Published : Apr 3, 2019, 7:41 PM IST

రాష్ట్రంలో ఉల్లి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. గత వారం రోజులుగా వినియోగదారుల డిమాండ్ పెరగటం వల్ల ధరలు కాస్త పెరిగి అన్నదాతలకు ఉపశమనం కల్గిస్తున్నాయి. మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్​లో క్వింటాల్ ఉల్లి ధర రూ. 650 నుంచి 912 వరకు పలుకుంతోంది.

మళ్లీ పెరుగుతోన్న ఉల్లి ధరలు
మళ్లీ పెరుగుతోన్న ఉల్లి ధరలు
మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాలో ప్రతి బుధవారం ఉల్లిని రైతులు దేవరకద్ర వ్యవసాయ మార్కెట్​లో విక్రయిస్తుంటారు. గత 15 రోజుల కిందటి వరకు క్వింటా ఉల్లి ధర రూ.400 నుంచి 650 పలికింది. సాధారణంగా ఉగాది పండుగ సమయంలో ఉల్లిని అత్యధికంగా కొనుగోలు చేసి వినియోగదారులు నిల్వ చేసుకుంటుంటారు. ఈ సందర్భంగా ఉల్లి ధరలు కాస్త పెరగాలి. ఉల్లి క్రయ విక్రయాలు జరిగే ప్రధాన మార్కెట్లలో ఆశించిన స్థాయిలో డిమాండ్ లేకపోవడంతో ధరలు అనుకున్న స్థాయిలో పెరగలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:పగిలిన మిషన్ భగీరథ పైపు లైను, నీరు వృథా

మళ్లీ పెరుగుతోన్న ఉల్లి ధరలు
మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాలో ప్రతి బుధవారం ఉల్లిని రైతులు దేవరకద్ర వ్యవసాయ మార్కెట్​లో విక్రయిస్తుంటారు. గత 15 రోజుల కిందటి వరకు క్వింటా ఉల్లి ధర రూ.400 నుంచి 650 పలికింది. సాధారణంగా ఉగాది పండుగ సమయంలో ఉల్లిని అత్యధికంగా కొనుగోలు చేసి వినియోగదారులు నిల్వ చేసుకుంటుంటారు. ఈ సందర్భంగా ఉల్లి ధరలు కాస్త పెరగాలి. ఉల్లి క్రయ విక్రయాలు జరిగే ప్రధాన మార్కెట్లలో ఆశించిన స్థాయిలో డిమాండ్ లేకపోవడంతో ధరలు అనుకున్న స్థాయిలో పెరగలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:పగిలిన మిషన్ భగీరథ పైపు లైను, నీరు వృథా

Intro:Tg_Mbnr_10_03_Ulli_Dharalu_Avb_G3
ఉల్లి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్ లో కింటా ఉల్లి ఉల్లి రూ. 650 నుంచి రూ.912 వరకు కొనసాగింది


Body:మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలో ఉల్లిని సాగు చేసిన రైతులు దేవరకద్ర వ్యవసాయ మార్కెట్ లో ప్రతి బుధవారం విక్రయిస్తుంటారు. గత 15 రోజుల కిందటి వరకు క్వింటా ఉల్లి రూ. 400 నుంచి రూ.650 కొనసాగింది
వారం రోజులుగా గా వినియోగదారుల డిమాండ్ పెరగడంతో ధరలు కాస్త పెరిగి రూ.650 నుంచి రూ. 900 వరకు కొనసాగుతుంది.
సాధారణంగా ఉగాది పండుగ సమయంలో ఉల్లి ని అత్యధికంగా కొనుగోలు చేసి వినియోగదారులు నిల్వ చేసుకునే సమయం . ఈ సందర్భంగా ఉల్లి ధరలు కాస్త పెరగాలి కానీ ఉల్లి క్రయ విక్రయాలు జరిగే ప్రధాన మార్కెట్లలో ఆశించిన స్థాయిలో డిమాండ్ లేకపోవడంతో ఉల్లి ధరలు అనుకున్న స్థాయిలో పెరగలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు .
బుధవారం సుమారు 200 kintala ఉల్లి విక్రయానికి వస్తే క్వింటాకు రూ.640 నుంచి రూ . 912 వరకు కొనసాగిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.


Conclusion:గత 15 రోజులుగా ఉల్లి ధరలు నిలకడగా కొనసాగుతున్నయి. కానీ రైతులు ఆశిస్తున్న స్థాయిలో గిట్టుబాటు ధర లభించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.