ETV Bharat / state

నాలుగు రోజులు.. అయిదు ప్రాణాలు..

author img

By

Published : Aug 20, 2020, 6:19 PM IST

ముసురు వర్షాలతో ఇళ్లు కూలి ఉమ్మడి జిల్లాలో అయిదుగురు దుర్మరణం పాలయ్యారు.. నాలుగు రోజుల వ్యవధిలో ఇద్దరు బాలికలు సహా మొత్తం అయిదుగురు మృత్యువాత పడ్డారు.. ఈ నెల 16న ఆదివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా తెలకపల్లి మండలం రాకొండకు చెందిన వృద్ధురాళ్లు రాసాల కోటమ్మ, ఆమె కూతురు బొజ్జమ్మ మృతి చెందిన ఘటన మరువకముందే మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌ మండలం పగిడ్యాలలో ఇల్లు కూలి శరణమ్మ, ఆమె కుమార్తెలు భవాని, వైశాలిలు మృతి చెందడం విషాదాన్ని నింపింది.

heavy rains in mahabubnagar district -
నాలుగు రోజులు.. అయిదు ప్రాణాలు..

మ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో ముసురు వర్షాలు జన జీవనాన్ని స్తంభింపజేశాయి.. చెరువులు నిండిపోగా వాగులు ఉద్ధృతంగా ప్రవహించాయి. పట్టణాలు, గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన ఇళ్లు, గోడలు పలు చోట్ల కూలిపోయాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,477 ఇళ్లు శిథిలావస్థకు చేరినట్లు గుర్తించారని ‘ఈనాడు’లో ఈ నెల 17న ‘గూడు చెదిరింది!’ కథనం ప్రచురితమైంది. కథనంలో అధికారులు వెంటనే దృష్టిసారించి పాక్షికంగా, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లను గుర్తించి తీసుకోవాల్సిన చర్యలు ప్రస్తావనకు వచ్చాయి. మరో మూడు, నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో దృష్టిసారించకపోవడంతో వర్షానికి మరో ఇల్లు కూలి ముగ్గురు మృతి చెందడం ఉమ్మడి జిల్లావాసులను ఆవేదనకు గురి చేసింది.

ఆ చిన్నారి ఆటల్లో ముందంజ

గండీడ్‌ మండలం పగిడ్యాలలో మల్లప్ప ఇల్లు కూలిన ప్రమాదంలో మృతి చెందిన ఆయన చిన్న కుమార్తె వైశాలి ఓ ప్రైవేటు పాఠశాలలో మూడో తరగతి పూర్తి చేసింది. ఆమె ఆటల్లో ముందంజలో ఉండేదని పాఠశాల నిర్వాహకులు వెల్లడించారు. వైశాలి అంటే అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు ఉండటంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు.

అధికారులు పరిశీలించినా..

ముసురు వర్షాలకు కూలే అవకాశమున్న ఇళ్లను గ్రామాల్లో ఈ నెల 17, 18 తేదీల్లో గ్రామ స్థాయి అధికారులు పరిశీలించారు. ఇందులో భాగంగా గండీడ్‌ మండలం పగిడ్యాలలో మల్లప్ప ఇంటి వద్దకు వెళ్లిన సమయంలో దూలం విరిగిందని వేరే కర్రను ఊతంగా పెట్టామని, ఇబ్బంది లేదన్నారు. కానీ అప్పుడే ఇల్లు ఖాళీ చేసి ఉంటే మూడు ప్రాణాలు దక్కి ఉండేవని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు.

ఇప్పటికైనా అప్రమత్తం కండి : జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో మట్టి మిద్దెలు ఎక్కువే. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,477 ఇళ్లు శిథిలావస్థలో ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు. రెండ్రోజుల నుంచి వర్షాలు లేకున్నా ఇంకా వర్షాకాలం ముగియకపోవడంతో ఎప్పుడైనా పడే అవకాశముంది. ఇప్పటికైనా అధికారులు అప్రమత్తమై తగు చర్యలు తీసుకుంటే ప్రాణ నష్టం లేకుండా చూడొచ్ఛు.

ఈ నెల 17వ తేదీన ‘ఈనాడు’లో ఉమ్మడి జిల్లాలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లపై ప్రచురితమైన కథనం

మ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో ముసురు వర్షాలు జన జీవనాన్ని స్తంభింపజేశాయి.. చెరువులు నిండిపోగా వాగులు ఉద్ధృతంగా ప్రవహించాయి. పట్టణాలు, గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన ఇళ్లు, గోడలు పలు చోట్ల కూలిపోయాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,477 ఇళ్లు శిథిలావస్థకు చేరినట్లు గుర్తించారని ‘ఈనాడు’లో ఈ నెల 17న ‘గూడు చెదిరింది!’ కథనం ప్రచురితమైంది. కథనంలో అధికారులు వెంటనే దృష్టిసారించి పాక్షికంగా, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లను గుర్తించి తీసుకోవాల్సిన చర్యలు ప్రస్తావనకు వచ్చాయి. మరో మూడు, నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో దృష్టిసారించకపోవడంతో వర్షానికి మరో ఇల్లు కూలి ముగ్గురు మృతి చెందడం ఉమ్మడి జిల్లావాసులను ఆవేదనకు గురి చేసింది.

ఆ చిన్నారి ఆటల్లో ముందంజ

గండీడ్‌ మండలం పగిడ్యాలలో మల్లప్ప ఇల్లు కూలిన ప్రమాదంలో మృతి చెందిన ఆయన చిన్న కుమార్తె వైశాలి ఓ ప్రైవేటు పాఠశాలలో మూడో తరగతి పూర్తి చేసింది. ఆమె ఆటల్లో ముందంజలో ఉండేదని పాఠశాల నిర్వాహకులు వెల్లడించారు. వైశాలి అంటే అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు ఉండటంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు.

అధికారులు పరిశీలించినా..

ముసురు వర్షాలకు కూలే అవకాశమున్న ఇళ్లను గ్రామాల్లో ఈ నెల 17, 18 తేదీల్లో గ్రామ స్థాయి అధికారులు పరిశీలించారు. ఇందులో భాగంగా గండీడ్‌ మండలం పగిడ్యాలలో మల్లప్ప ఇంటి వద్దకు వెళ్లిన సమయంలో దూలం విరిగిందని వేరే కర్రను ఊతంగా పెట్టామని, ఇబ్బంది లేదన్నారు. కానీ అప్పుడే ఇల్లు ఖాళీ చేసి ఉంటే మూడు ప్రాణాలు దక్కి ఉండేవని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు.

ఇప్పటికైనా అప్రమత్తం కండి : జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో మట్టి మిద్దెలు ఎక్కువే. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,477 ఇళ్లు శిథిలావస్థలో ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు. రెండ్రోజుల నుంచి వర్షాలు లేకున్నా ఇంకా వర్షాకాలం ముగియకపోవడంతో ఎప్పుడైనా పడే అవకాశముంది. ఇప్పటికైనా అధికారులు అప్రమత్తమై తగు చర్యలు తీసుకుంటే ప్రాణ నష్టం లేకుండా చూడొచ్ఛు.

ఈ నెల 17వ తేదీన ‘ఈనాడు’లో ఉమ్మడి జిల్లాలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లపై ప్రచురితమైన కథనం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.