నూతన రెవెన్యూ చట్టం దిశగా మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండల తహసీల్దార్ కార్యాలయంలో కసరత్తు వేగవంతంగా జరుగుతోంది. వీఆర్వోలు, వీఆర్ఏలు మధ్యాహ్నం 3 గంటల లోగా తమ వద్ద ఉన్న దస్త్రాలు సమర్పించాలన్న ప్రభుత్వ ఆదేశంతో.. అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
దేవరకద్ర కార్యాలయంలో వీఆర్వో, వీఆర్ఏలు తమ వద్ద ఉన్న దస్త్రాలు సమర్పించేందుకు సిద్ధమయ్యారు. భూ సమస్యల పరిష్కారానికి వచ్చే వారికి సంబంధించి ఎలాంటి సంతకాలు చేసే పరిస్థితి లేదని రెవెన్యూ సిబ్బంది నిర్మొహమాటంగా చెప్పి పంపిస్తున్నారు.
- ఇదీ చదవండీ... రాష్ట్రంలో 5లక్షలకు చేరువలో కరోనా కేసులు