ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో కరోనా వైరస్ సంఖ్య రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. వరుసగా ఈనెల 9న 618 కేసులు, 10న 526, 11న 438, 12న 364, 13న 258 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఫలితంగా మహమ్మారి విజృంభన తగ్గింది.
నాగర్కర్నూల్ జిల్లాలో..
నాగర్కర్నూల్ జిల్లాలో 100, జిల్లా కేంద్రంతో పాటు కల్వకుర్తిలో 20 చొప్పున, అచ్చంపేట 16, కొల్లాపూర్ 13 కేసులతో పాటు జిల్లాలోని వివిధ మండలాల్లో 31 కేసులు నమోదయ్యాయి.
మహబూబ్నగర్ జిల్లాలో..
మహబూబ్నగర్ జిల్లాలో 83, జిల్లా కేంద్రంలో 34, జడ్చర్లలో 19 కేసులు నమోదయ్యాయి. వివిధ మండలాల్లో మరో 31 కేసులు నమోదయ్యాయి.
జోగులాంబ గద్వాల జిల్లాలో..
జోగులాంబ గద్వాల జిల్లాలో 38, జిల్లా కేంద్రంలో 11, అయిజలో 7 కొత్త కేసులు వెలుగు చూడగా .. వివిధ మండలాల్లో 20 మంది కొవిడ్ బారిన పడ్డారు.
వనపర్తి జిల్లాలో..
వనపర్తి జిల్లాలో 35, జిల్లా కేంద్రంలో 20, పెబ్బేరులో 5 మందితో పాటు ఇతర మండలాల్లో మరో 10 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
నారాయణపేట జిల్లాలో..
నారాయణపేట జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి.