ETV Bharat / state

Congress Jung Siren in Mahabubnagar : పాలమూరులో నేడు జంగ్ సైరన్

author img

By

Published : Oct 12, 2021, 7:08 AM IST

తెలంగాణలో ఉద్యోగ నియామకాలు, నిరుద్యోగ భృతి, బోధన బకాయిల చెల్లింపు సమస్యలపై కాంగ్రెస్​ గొంతెత్తుతోంది. కాంగ్రెస్ పార్టీ జంగ్ సైరన్(Congress Jung Siren in Mahabubnagar) పేరుతో ఆందోళనలు నిర్వహిస్తూ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ మహబూబ్​నగర్ జిల్లా అమిస్తాపూర్​లో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. నిరుద్యోగులు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థులు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిస్తోంది.

పాలమూరులో నేడు మోగనున్న జంగ్ సైరన్
పాలమూరులో నేడు మోగనున్న జంగ్ సైరన్
పాలమూరులో నేడు మోగనున్న జంగ్ సైరన్

పాలమూరు వేదికగా నేడు కాంగ్రెస్ పార్టీ జంగ్ సైరన్(Congress Jung Siren in Mahabubnagar) మోగించనుంది. ఉద్యోగ నియామకాలు,నిరుద్యోగ భృతి, బోధన బకాయిల చెల్లింపు సమస్యలపై....మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. సభ విజయవంతమయ్యేలా జిల్లా నేతలు భారీసంఖ్యలో జనసమీకరణ చేస్తున్నారు.

అమిస్తాపూర్​లో సభ..

విద్యార్థి, నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన జంగ్‌ సైరన్‌(Congress Jung Siren in Mahabubnagar)కు నేడు పాలమూరు వేదిక కానుంది. భూత్పూరు మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్‌లో భారీ బహిరంగ సభకు హస్తం పార్టీ ఏర్పాట్లు పూర్తి చేసింది. సాయంత్రం 3 గంటలకు ప్రారంభమై రాత్రి 7గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సభకు హాజరుకానున్నారు. పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఆయన మహబూబ్‌నగర్‌ జిల్లాకు రానుండటంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 14 నియోజక వర్గాల నుంచి భారీఎత్తున జనసమీకరణ చేస్తున్నారు. ఇప్పటికే అన్నినియోజక వర్గాల్లో మండల స్థాయిలో సమావేశాలు ఏర్పాటుచేసి విద్యార్ధులు, నిరుద్యోగులు సహా పార్టీ కార్యకర్తలను తరలించేందుకు సన్నాహాలు పూర్తి చేశారు. సుమారు 2లక్షల మందిని సభలో భాగం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

గెజిట్ అమలుపై మరో పోరు..

జంగ్ సైరన్ సభాస్థలిని సీనియర్ నేతలు మల్లురవి, వేం నరేందర్ రెడ్డి సహా పలువురు నేతలు పరిశీలించారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని తెరాస ప్రభుత్వం నెరవేర్చలేదని మల్లు రవి విమర్శించారు. త్వరలో నదీ జలాల బోర్డులపై విడుదలైన గెజిట్‌లకు వ్యతిరేకంగా మరో ఉద్యమాన్ని తీసుకొస్తామని వెల్లడించారు. జంగ్‌ సైరన్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

భారీగా చేరికలు..

రేవంత్ సభలో పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. జడ్చర్ల మాజీ శాసనసభ్యుడు ఎర్రశేఖర్, కొల్లాపూర్‌కు చెందిన మరో నేత జగదీశ్వరరావు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న పాలమూరు జిల్లాలో..రేవంత్ రాకతో పూర్వవైభవం వస్తుందని జిల్లా నాయకులు ఆకాంక్షిస్తున్నారు.

పాలమూరులో నేడు మోగనున్న జంగ్ సైరన్

పాలమూరు వేదికగా నేడు కాంగ్రెస్ పార్టీ జంగ్ సైరన్(Congress Jung Siren in Mahabubnagar) మోగించనుంది. ఉద్యోగ నియామకాలు,నిరుద్యోగ భృతి, బోధన బకాయిల చెల్లింపు సమస్యలపై....మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. సభ విజయవంతమయ్యేలా జిల్లా నేతలు భారీసంఖ్యలో జనసమీకరణ చేస్తున్నారు.

అమిస్తాపూర్​లో సభ..

విద్యార్థి, నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన జంగ్‌ సైరన్‌(Congress Jung Siren in Mahabubnagar)కు నేడు పాలమూరు వేదిక కానుంది. భూత్పూరు మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్‌లో భారీ బహిరంగ సభకు హస్తం పార్టీ ఏర్పాట్లు పూర్తి చేసింది. సాయంత్రం 3 గంటలకు ప్రారంభమై రాత్రి 7గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సభకు హాజరుకానున్నారు. పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఆయన మహబూబ్‌నగర్‌ జిల్లాకు రానుండటంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 14 నియోజక వర్గాల నుంచి భారీఎత్తున జనసమీకరణ చేస్తున్నారు. ఇప్పటికే అన్నినియోజక వర్గాల్లో మండల స్థాయిలో సమావేశాలు ఏర్పాటుచేసి విద్యార్ధులు, నిరుద్యోగులు సహా పార్టీ కార్యకర్తలను తరలించేందుకు సన్నాహాలు పూర్తి చేశారు. సుమారు 2లక్షల మందిని సభలో భాగం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

గెజిట్ అమలుపై మరో పోరు..

జంగ్ సైరన్ సభాస్థలిని సీనియర్ నేతలు మల్లురవి, వేం నరేందర్ రెడ్డి సహా పలువురు నేతలు పరిశీలించారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని తెరాస ప్రభుత్వం నెరవేర్చలేదని మల్లు రవి విమర్శించారు. త్వరలో నదీ జలాల బోర్డులపై విడుదలైన గెజిట్‌లకు వ్యతిరేకంగా మరో ఉద్యమాన్ని తీసుకొస్తామని వెల్లడించారు. జంగ్‌ సైరన్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

భారీగా చేరికలు..

రేవంత్ సభలో పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. జడ్చర్ల మాజీ శాసనసభ్యుడు ఎర్రశేఖర్, కొల్లాపూర్‌కు చెందిన మరో నేత జగదీశ్వరరావు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న పాలమూరు జిల్లాలో..రేవంత్ రాకతో పూర్వవైభవం వస్తుందని జిల్లా నాయకులు ఆకాంక్షిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.