కంటతడి పెట్టిన మాజీ ఎంపీ సీతారాం నాయక్
తెరాసలో ఐదు సంవత్సరాలు మచ్చలేని వ్యక్తిగా పని చేశానని మాజీ ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. మహబూబాబాద్ ఎంపీగా తనకు టికెట్ దక్కకపోవడం వల్ల భావోద్వేగానికి లోనయ్యారు.
మాజీ ఎంపీ సీతారాం నాయక్
మహబూబాబాద్ నియోజకవర్గంలో జాతీయ రహదారి, పాస్పోర్ట్ కార్యాలయం తీసుకురావడం వంటి అభివృద్ధి పనులు చేశానని మాజీ ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సభకు హాజరయ్యారు. ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థికి సహకరిస్తానని తెలిపారు. సభలో భావోద్వేగానికి గురైన సీతారాంను మంత్రి ఎర్రబెల్లి ఓదారుస్తూ.. ముఖ్యమంత్రి ఇంతకన్నా మంచి అవకాశం కల్పిస్తారని భరోసా ఇచ్చారు.
sample description