ETV Bharat / state

సీపీఎం ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సరుకుల పంపిణీ

మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు రంజాన్​ పండుగ సరుకులను పంపిణీ చేశారు. లాక్​డౌన్​ వల్ల ఉపాధి లేక.. పండుగను జరుపుకోలేని వారందరికీ తమ వంతు సాయం చేసినట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ తెలిపారు.

author img

By

Published : May 23, 2020, 9:27 AM IST

ramzan festival essentials distribution at mahabubabad
సీపీఎం ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సరుకుల పంపిణీ

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్​ వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లాక్​డౌన్​ ప్రకటించాయి. దీని వల్ల ఎలాంటి పనులు దొరక్క నిరుపేదలు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. ఈ సమయంలో రంజాన్​ మాసం రావడం వల్ల ముస్లిం పేదలు పండుగను జరుపుకోకుండా ఇబ్బందులు పడకూడదని మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో నిరుపేద ముస్లింలకు రంజాన్ పండుగ సరుకులను పంపిణీ చేశారు.

లాక్​డౌన్​ కారణంగా ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో నిత్యావసరాలను అందజేస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్​ అన్నారు. కరోనా వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా ఈ ఏడాది రంజాన్​ పండుగను ఇళ్లల్లోనే జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్​ వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లాక్​డౌన్​ ప్రకటించాయి. దీని వల్ల ఎలాంటి పనులు దొరక్క నిరుపేదలు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. ఈ సమయంలో రంజాన్​ మాసం రావడం వల్ల ముస్లిం పేదలు పండుగను జరుపుకోకుండా ఇబ్బందులు పడకూడదని మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో నిరుపేద ముస్లింలకు రంజాన్ పండుగ సరుకులను పంపిణీ చేశారు.

లాక్​డౌన్​ కారణంగా ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో నిత్యావసరాలను అందజేస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్​ అన్నారు. కరోనా వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా ఈ ఏడాది రంజాన్​ పండుగను ఇళ్లల్లోనే జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి: ఆటోడ్రైవర్​ చేసిన పెట్రోల్​ దాడిలో.. హెల్త్​వర్కర్​ మృతి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.