మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని వందేమాతరం ఫౌండేషన్ విద్యార్థులు.. 30 రకాల వివిధ విత్తనాలతో లక్ష సీడ్ బాల్స్ను తయారు చేస్తున్నారు. ఈ మేరకు పాలకుర్తి ఎమ్మెల్యే, పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు విద్యార్థులు గ్రీన్ ఛాలెంజ్ను విసిరారు.
పాలకుర్తిలో ప్రకృతి ప్రేమికులు ఎవరితోనైనా తాము చేసిన లక్ష సీడ్ బాల్స్ కంటే ఒక్కటైన ఎక్కువ సీడ్ బాల్స్ను తయారు చేయాలని మంత్రికి విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ఇలా సీడ్ బాల్స్ను తయారు చేసి వాటిని నాటనున్నట్లు ఫౌండేషన్ నిర్వహకులు తెలిపారు.
ఇదీ చదవండి:ఆడుకున్న ఇంటిని కూల్చేశారు.. ఆడించిన నాన్నను చంపేశారు!