ETV Bharat / state

తొర్రూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్యాయత్నం

author img

By

Published : Aug 21, 2020, 6:18 PM IST

తన భూమి పాసుపుస్తకాన్ని రెవెన్యూ అధికారులు వేరే వారి పేరు మీద నమోదు చేశారని ఆవేదన చెందిన ఓ రైతు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన మహబూబాబాద్​ జిల్లా తొర్రూరులో చోటుచేసుకుంది.

farmer tried to commit suicide in Thorrur in mahabubabad district
తొర్రూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద రైతు బలవన్మరణ యత్నం

మహబూబాబాద్​ జిల్లా తొర్రూరు మండలకేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఓ రైతు బలవన్మరణానికి యత్నించాడు. దంతాలపల్లి మండలం రామాంజపురానికి చెందిన సత్తిరెడ్డి అనే రైతు తన భూమికి చెందిన పాసుపుస్తకం వేరే వారి పేరు మీద నమోదు చేశారని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

సంవత్సరం నుంచి కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా.. అధికారులు స్పందించడం లేదని ఆర్డీఓ ఆఫీసు ముందు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు యత్నించాడు.సమీపాన ఉన్న రైతులు అతణ్ని అడ్డుకుని ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు.

మహబూబాబాద్​ జిల్లా తొర్రూరు మండలకేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఓ రైతు బలవన్మరణానికి యత్నించాడు. దంతాలపల్లి మండలం రామాంజపురానికి చెందిన సత్తిరెడ్డి అనే రైతు తన భూమికి చెందిన పాసుపుస్తకం వేరే వారి పేరు మీద నమోదు చేశారని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

సంవత్సరం నుంచి కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా.. అధికారులు స్పందించడం లేదని ఆర్డీఓ ఆఫీసు ముందు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు యత్నించాడు.సమీపాన ఉన్న రైతులు అతణ్ని అడ్డుకుని ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.