తెలంగాణ రాష్ట్రంలో నకిలీ విత్తనాలు.. పురుగులమందును విక్రయించి రైతులను మోసం చేస్తున్న వ్యాపారులపై పీడీ యాక్ట్ను నమోదు చేశారు. రాష్ట్రంలో నకిలీ ముఠాలు తమ కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నాయి. అమ్మకానికి సిద్ధంగా ఉంచిన రూ. 50 లక్షల విలువైన నకిలీ పత్తి, మిరప, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలు ఉంచిన డీసీఎం వాహనం, ప్యాకింగ్ సామగ్రిని మహబూబాబాద్ పట్టణ పోలీసులు పట్టుకున్నారు.
మహబూబాబాద్లోని కేంద్రంలో ఓ ఇంట్లో వీటిని స్వాధీనం చేసుకుని ముఠాలోని నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. మరో ఐదుగురు వ్యక్తులు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ నమోదు చేయనున్నట్లు తెలిపారు.