ETV Bharat / state

'వ్యవసాయ బిల్లులు రైతులపాలిట శాపంగా మారాయి'

author img

By

Published : Oct 2, 2020, 7:26 PM IST

మహబూబాబాద్​లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ex minister balram nayak participaed in rally in mahaboobabad
ex minister balram nayak participaed in rally in mahaboobabad

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మహబూబాబాద్​లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ ర్యాలీలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు.

అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన వ్యవసాయ బిల్లులు కార్పొరేట్ రంగానికి వరంగా... రైతుల పాలిట శాపంగా మారిందని బలరాం నాయక్​ మండిపడ్డారు. హథ్రస్​ ఘటన బాధిత కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న రాహుల్​ గాంధీపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు.

ఇదీ చూడండి: యూపీ ఘటన నిందితులకు శిక్ష పడేలా చేస్తాం: కిషన్​రెడ్డి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మహబూబాబాద్​లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ ర్యాలీలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు.

అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన వ్యవసాయ బిల్లులు కార్పొరేట్ రంగానికి వరంగా... రైతుల పాలిట శాపంగా మారిందని బలరాం నాయక్​ మండిపడ్డారు. హథ్రస్​ ఘటన బాధిత కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న రాహుల్​ గాంధీపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు.

ఇదీ చూడండి: యూపీ ఘటన నిందితులకు శిక్ష పడేలా చేస్తాం: కిషన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.