మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో త్వరలో జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు వివిధ పార్టీల నేతలు. చిన్న చెరువులో కొనసాగుతున్న ఉపాధి హామీ పథకం పనుల్లో పాల్గొన్న కూలీలను తెరాస జడ్పీటీసీ అభ్యర్థి నూకల వెంకటేశ్వర్రెడ్డి కలిశారు. తనను గెలిపిస్తే మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. జనసేన జడ్పీటీసీ అభ్యర్థి మార్క కృష్ణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జనసేనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఇదీ చదవండిః వారణాసిలో నిజామాబాద్ రైతుల నామినేషన్లు