భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ పర్యటించారు. ముందుగా సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎంపీ సీతారాం నాయక్కు మళ్లీ టికెట్ ఇస్తున్నారా లేదా అంటూ వస్తున్న వదంతులపై ఆయన స్పందించారు. సీతారాం నాయక్ 5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని ముఖ్యమంత్రి అన్నారని ఎంపీ గుర్తు చేశారు. ఈ నెల 16న ఎంపీ టికెట్పై స్పష్టత వస్తుందన్నారు. మళ్లీ టికెట్ వస్తే ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఇవీ చూడండి:కాడివదిలి అడ్డ మీదికి