కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అటవీశాఖ అధికారిణి అనితపై జడ్పీ వైస్ ఛైర్మన్ కోనేరు కృష్ణారావు నేతృత్వంలో కొంతమంది కర్రలతో దాడి చేయటం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై వరంగల్ రేంజి ఐజీ నాగిరెడ్డి స్పందించారు. అటవీ శాఖ అధికారుల విధులకు ఎవరు ఆటంకం కలిగించిన ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కోనేరు కృష్ణారావు, బురం పొశంను అదుపులోకి తీసుకున్నామని.. మొత్తం 14 మందిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో నిర్మల్ ఎస్పీ శశిధర్ రాజు, కుమురం భీం ఎస్పీ మల్లారెడ్డి పాల్గొన్నారు.
ఇవీచూడండి: అటవీ శాఖ అధికారిణిపై తెరాస నేత దాడి