కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం బోడేపల్లి గ్రామానికి చెందిన గడిల అమ్మక్క అనే మహిళకు అగ్ని ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. సాయంత్రం సమయంలో ఇంట్లో వంట చేయటానికి గ్యాస్ పొయ్యి వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తు నిప్పంటుకుందని బాధిత మహిళ తెలిపింది. పట్టణంలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి: భార్య పుట్టింటికి వెళ్లిందని పిల్లల్ని హతమార్చాడు