వరుణుడి కరుణ కోసం ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం బద్రుతండాలో కప్పలకు నీళ్లు పోసి ఊరేగించారు. మండిపోతున్న ఎండలు, వడగాలులను భరించలేక వర్షాలు కురవాలని దేవుళ్లను వేడుకుంటున్నారు. గ్రామంలోని ఇంటింటికి ఊరేగింపుగా వెళ్లి కప్పలకు నీళ్లు పోసి వేడుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో గ్రామ దేవతలకు జలాభిషేకం చేస్తూ మొక్కులు తీర్చుకున్నారు.
ఇవీ చూడండి: జగిత్యాల జిల్లాలో సర్కారు బడిని బతికించుకున్నారు