ETV Bharat / state

మొక్కల పెంపకం ఆహ్లాదకరం.. ఆరోగ్యకరం

author img

By

Published : Jun 5, 2020, 4:47 PM IST

Updated : Jun 5, 2020, 7:10 PM IST

పూర్వీకుల నుంచి మనకు సంక్రమించిన ఆస్తి పర్యావరణం. మన భవిష్యత్​ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించడమే మన లక్ష్యం. అందుకు మనం చేయాల్సిందల్లా ఒక్కటే ప్రతిఒక్కరం విధిగా మొక్కలు నాటాల్సిందే. ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. పిల్లలకు ఆస్తులు, అంతస్తులు ఇవ్వకపోయినా మంచి పర్యావరణం అందించగలిగితే ఎంతో మేలు చేసిన వాళ్లమమవుతాం. ఇదే స్ఫూర్తితో ఖమ్మం జిల్లా మధిర ప్రాంతానికి చెందిన పలువురు పర్యావరణ ప్రేమికులు తమ వంతు బాధ్యతగా ముందుకు సాగుతున్నారు. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కల పెంపకంపై ప్రత్యేక కథనం.

ఇళ్లలో అందరూ మొక్కలు పెంచుకోవాలి : పర్యావరణ ప్రేమికులు
ఇళ్లలో అందరూ మొక్కలు పెంచుకోవాలి : పర్యావరణ ప్రేమికులు

ఖమ్మం జిల్లాలో పలు రకాల ఔషధ పండ్ల మొక్కలను పెంచుతున్నారు పర్యావరణ ప్రేమికులు. మధిరకు చెందిన మేదరమెట్ల నవీన్ కుమార్ గత ఐదేళ్లుగా ఇంటి ఆవరణను మొక్కల పెంపకానికి కేంద్రంగా మార్చుకున్నారు. నివాసం చుట్టూ నీడనిచ్చే చెట్లు, తీగలకు వేలాడే ఆకులను అల్లుకున్న నందనవనంగా తన ఇంటిని తీర్చిదిద్దారు.

ఇంటిపై భాగంలోనూ..

ఇంటిపై భాగంలోనూ.. పలు రకాల మొక్కలను పెంచుతున్నారు. మరో పర్యావరణ ప్రేమికుడు చెరుకూరి నాగార్జున ఏకంగా నర్సరీలను ఏర్పాటు చేశాడు. వందల రకాల మొక్కలను పోషిస్తూ.. ఆసక్తి కలిగిన గృహస్తులకు, రైతులకు తక్కువ ధరకే శిక్షణ అందిస్తూ.. ప్రోత్సాహం అందిస్తున్నాడు.

ప్రతి రోజు నీరు..

పూర్తి సేంద్రియ విధానాలతోనే మొక్కలను పెంచుతూ.. రోజూ ఉదయం వ్యాయామంలో భాగంగా వాటికి పాదులు తీసి నీరు పోస్తున్నారు. ఓ వైపు ఆరోగ్యం.. మరోవైపు ఆహ్లాదాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఇంటి అవసరాలకు సరిపడా ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలను పెంచటం ఇక్కడ ప్రత్యేకత. వీరిని చూసిన కాలనీ వాసులు మొక్కల పెంపకానికి, తద్వారా పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించడం హర్షనీయం.

ఇళ్లలో అందరూ మొక్కలు పెంచుకోవాలి : పర్యావరణ ప్రేమికులు

ఇవీ చూడండి : దేశంలోని మూడు రాష్ట్రాల్లో భూప్రకంపనలు

ఖమ్మం జిల్లాలో పలు రకాల ఔషధ పండ్ల మొక్కలను పెంచుతున్నారు పర్యావరణ ప్రేమికులు. మధిరకు చెందిన మేదరమెట్ల నవీన్ కుమార్ గత ఐదేళ్లుగా ఇంటి ఆవరణను మొక్కల పెంపకానికి కేంద్రంగా మార్చుకున్నారు. నివాసం చుట్టూ నీడనిచ్చే చెట్లు, తీగలకు వేలాడే ఆకులను అల్లుకున్న నందనవనంగా తన ఇంటిని తీర్చిదిద్దారు.

ఇంటిపై భాగంలోనూ..

ఇంటిపై భాగంలోనూ.. పలు రకాల మొక్కలను పెంచుతున్నారు. మరో పర్యావరణ ప్రేమికుడు చెరుకూరి నాగార్జున ఏకంగా నర్సరీలను ఏర్పాటు చేశాడు. వందల రకాల మొక్కలను పోషిస్తూ.. ఆసక్తి కలిగిన గృహస్తులకు, రైతులకు తక్కువ ధరకే శిక్షణ అందిస్తూ.. ప్రోత్సాహం అందిస్తున్నాడు.

ప్రతి రోజు నీరు..

పూర్తి సేంద్రియ విధానాలతోనే మొక్కలను పెంచుతూ.. రోజూ ఉదయం వ్యాయామంలో భాగంగా వాటికి పాదులు తీసి నీరు పోస్తున్నారు. ఓ వైపు ఆరోగ్యం.. మరోవైపు ఆహ్లాదాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఇంటి అవసరాలకు సరిపడా ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలను పెంచటం ఇక్కడ ప్రత్యేకత. వీరిని చూసిన కాలనీ వాసులు మొక్కల పెంపకానికి, తద్వారా పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించడం హర్షనీయం.

ఇళ్లలో అందరూ మొక్కలు పెంచుకోవాలి : పర్యావరణ ప్రేమికులు

ఇవీ చూడండి : దేశంలోని మూడు రాష్ట్రాల్లో భూప్రకంపనలు

Last Updated : Jun 5, 2020, 7:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.