చట్టసభల్లో న్యాయవాదులు, నిరుద్యోగులు, సామాన్యుల సమస్యలపై ప్రశ్నించే గొంతుకకు పట్టం కట్టాలని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి చెరుకు సుధాకర్ అన్నారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా... ఖమ్మం జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులను కలిసి ఓటు అభ్యర్థించారు.
న్యాయవాదుల సమస్యలు తనకు తెలుసునని... పరిష్కారం కోసం కృషిచేస్తానని చెరుకు సుధాకర్ అన్నారు. పెద్దల సభకు పంపితే ప్రతి సమస్యపై పోరాడతానని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: గ్రేటర్ హైదరాబాద్ నేతలతో కేటీఆర్ భేటీ... ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చ