పారిశుద్ధ్య నిర్వహణకు ట్రాక్టర్ కొనుగోలులో రాష్ట్రంలో ఖమ్మం జిల్లా ముందుందని అందుకు సత్తుపల్లి నియోజకవర్గం కారణమని శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చందుపల్లిలో ట్రాక్టర్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
పల్లెప్రగతి కార్యక్రమం, ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నాయని సండ్ర పేర్కొన్నారు. హరితహారంలో నాటిన మొక్కల బాధ్యత సర్పంచ్లదేనని తెలిపారు.
ఇదీ చూడండి: అంబానీని వెనక్కి నెట్టి.. అగ్ర స్థానానికి జాక్మా!