ఖమ్మం జిల్లా కొణిజర్ల సమీపంలో మిషన్ భగీరథ గేట్ వాల్ లీకై తాగు నీరు వృథాగా పోతోంది. తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న గేట్ వాల్ నుంచి నీళ్లు పైకి చిమ్ముతూ పొలాల్లోకి ప్రవహించాయి.
రహదారి పక్కన ప్రయాణించే వాహనదారులు ఈ దృశ్యాన్ని ఆసక్తిగా తిలకించారు. అధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడం వల్లే తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపించారు.