వివిధ పనుల నిమిత్తం ఖమ్మం నగరానికి వచ్చిన మహిళలు ఇబ్బంది పడకుండా సంచార టాయిలెట్లను ప్రారంభిస్తున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం కలెక్టరేట్ వద్ద నేడు ఏడు సంచార శౌచాలయాలను ఆయన ప్రారంభించారు.
నగరంలో 4 వాహనాలు తిరుగుతాయని.. 3 వాహనాలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ వాహనాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. వీటితో పాటు మంత్రి కేటీఆర్ సూచన మేరకు నగరంలో సుమారు 140 మూత్రశాలలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్ పాపాలాల్, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, కమిషనర్ అనురాగ్ జయంతి తదితరులు పాల్గొన్నారు.
ఇదీచూడండి: కరోనా సోకితే గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటా: మంత్రి పువ్వాడ