రాష్ట్ర వ్యాప్త బంద్ సందర్భంగా ఖమ్మం జిల్లా ఏన్కూరు, వైరాలలో విపక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఏన్కూరులో భాజపా, వామపక్షాలు, ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఖమ్మం కొత్తగూడెం ప్రధాన రహదారిపై వాహనాలు బారులు తీరాయి. గంట పాటు రాస్తారోకో కొనసాగడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి : మహిళను వెంబడించి అరెస్టు చేసిన పోలీసులు