ETV Bharat / state

ఉరుములు మెరుపులతో వర్షం.. తడసిన ధాన్యం

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం పరిధిలో ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. ఒక్కసారిగా వాన పడడంతో కళ్లాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట నీటిపాలవడం వల్ల తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

author img

By

Published : May 16, 2021, 1:57 PM IST

grain dried up due to unseasonal rains
ఖమ్మం జిల్లాలో అకాల వర్షం

ఖమ్మం జిల్లా వైరా, కొణిజర్ల, ఏనుకూరు మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం ఎండగా ఉన్నప్పటికీ ఒక్కసారిగా వాన పడటంతో కళ్లాలోని ధాన్యం తడిసి ముద్దయింది. నీట మునిగిన పంటను కాపాడుకోవడానికి రైతులు నానా అవస్థలు పడాల్సి వచ్చింది.

ఆరబోసిన ధాన్యాన్ని కుప్పలుగా చేసి పరదాలు కప్పేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆరుగాల శ్రమించి పండించిన పంట నీటిపాలవడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోయారు. పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం మొక్కజొన్న తడిశాయి. వర్షం కారణంగా ప్రధాన రహదారుల వెంట నీరు నిలిచాయి.

ఖమ్మం జిల్లా వైరా, కొణిజర్ల, ఏనుకూరు మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం ఎండగా ఉన్నప్పటికీ ఒక్కసారిగా వాన పడటంతో కళ్లాలోని ధాన్యం తడిసి ముద్దయింది. నీట మునిగిన పంటను కాపాడుకోవడానికి రైతులు నానా అవస్థలు పడాల్సి వచ్చింది.

ఆరబోసిన ధాన్యాన్ని కుప్పలుగా చేసి పరదాలు కప్పేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆరుగాల శ్రమించి పండించిన పంట నీటిపాలవడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోయారు. పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం మొక్కజొన్న తడిశాయి. వర్షం కారణంగా ప్రధాన రహదారుల వెంట నీరు నిలిచాయి.

ఇదీ చదవండి: 120 ఏళ్ల క్రితమే దేశంలో లాక్​డౌన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.