ETV Bharat / state

అప్రమత్తంగా ఉందాం.. కరోనాను తరిమికొడదాం: భట్టి

author img

By

Published : Apr 23, 2020, 3:12 PM IST

ఖమ్మం జిల్లా మధిరలో కూరగాయల మార్కెట్, ప్రభుత్వ ఆసుపత్రి, బ్యాంకు ప్రాంగణాల వద్ద సొంత ఖర్చుతో హ్యాండ్ వాష్ శానిటైజర్ యంత్రాలను ఏర్పాటు చేయించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.

leader
కరోనాను తరిమికొడదాం

ప్రతి ఒక్కరూ.. స్వీయ నియంత్రణ పాటించి అప్రమత్తంగా ఉండటం ద్వారా కరోనా మహమ్మారిని తరిమికొట్టవచ్చని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో కూరగాయల మార్కెట్, ప్రభుత్వ ఆసుపత్రి, బ్యాంకు ప్రాంగణాల వద్ద సొంత ఖర్చుతో హ్యాండ్ వాష్ శానిటైజర్ యంత్రాలను ఏర్పాటు చేయించారు. సూర్యాపేటలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని... ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖమ్మం జిల్లా వాసులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం మధిర సేవాసమితి ఆధ్వర్యంలో పేదలకు మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వేమి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ.. స్వీయ నియంత్రణ పాటించి అప్రమత్తంగా ఉండటం ద్వారా కరోనా మహమ్మారిని తరిమికొట్టవచ్చని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో కూరగాయల మార్కెట్, ప్రభుత్వ ఆసుపత్రి, బ్యాంకు ప్రాంగణాల వద్ద సొంత ఖర్చుతో హ్యాండ్ వాష్ శానిటైజర్ యంత్రాలను ఏర్పాటు చేయించారు. సూర్యాపేటలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని... ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖమ్మం జిల్లా వాసులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం మధిర సేవాసమితి ఆధ్వర్యంలో పేదలకు మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వేమి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

ఇవీ చూడండి: 20 రోజుల్లోనే.. 1500 పడకలతో టిమ్స్ ఏర్పాటు: కేటీఆర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.