నీటి తొట్టిలో పడి కొట్టుమిట్టాడుతున్న ఓ కోతిని మానవతా దృక్పథంతో కాపాడాల్సింది పోయి… ఆ కోతిని ఉరి తీసి చంపాడో కర్కశుడు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం అమ్మపాలెంలో సాదు వేంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇంటి ఆవరణలో నీటి తొట్టి ఉంది. దాహార్తిని తీర్చుకునేందుకు వచ్చి ప్రమాదవశాత్తు ఆ ఖాళీ నీటి తోట్టిలో ఓ కోతి పడింది.
మూగజీవిపై కర్కశత్వం.. కోతిని కొట్టి, ఉరేసి చంపారు!
మనుషుల్లో మానవత్వం చచ్చిపోయింది... దాహార్తిని తీర్చుకునేందుకు వచ్చిన ఓ మూగ జీవి పట్ల కర్కశంగా వ్యవహరించి ఉరివేసి చంపిన అమానవీయ ఘటన అమ్మపాలెంలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ దారుణ సంఘటనను సెల్ఫోన్లో చిత్రీకరించటం వల్ల బయటకు వెలుగుచూసింది.
![మూగజీవిపై కర్కశత్వం.. కోతిని కొట్టి, ఉరేసి చంపారు! a-monkey-came-to-drink-water-some-peoples-was-hanged-that-creature-in-khammam-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7807489-760-7807489-1593392946798.jpg?imwidth=3840)
మూగ జీవిని కాపడాల్సింది పోయి మిగతా కోతులు చూస్తుండగా దాన్ని ఉరివేసి తనలోని పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. ఆ కోతి చనిపోవటం వల్ల కుక్కలకు ఆహారంగా పడేశాడు. మిగతా కోతులు కుక్కలను, మనుషులను దగ్గరికి రానీయకుండా మృతిచెందిన కోతిని తీసుకెళ్లి తమలోని ఐక్యమత్యాన్ని చాటుకున్నాయి. మూగజీవాల పట్ల ఇంత దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
నీటి తొట్టిలో పడి కొట్టుమిట్టాడుతున్న ఓ కోతిని మానవతా దృక్పథంతో కాపాడాల్సింది పోయి… ఆ కోతిని ఉరి తీసి చంపాడో కర్కశుడు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం అమ్మపాలెంలో సాదు వేంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇంటి ఆవరణలో నీటి తొట్టి ఉంది. దాహార్తిని తీర్చుకునేందుకు వచ్చి ప్రమాదవశాత్తు ఆ ఖాళీ నీటి తోట్టిలో ఓ కోతి పడింది.
మూగ జీవిని కాపడాల్సింది పోయి మిగతా కోతులు చూస్తుండగా దాన్ని ఉరివేసి తనలోని పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. ఆ కోతి చనిపోవటం వల్ల కుక్కలకు ఆహారంగా పడేశాడు. మిగతా కోతులు కుక్కలను, మనుషులను దగ్గరికి రానీయకుండా మృతిచెందిన కోతిని తీసుకెళ్లి తమలోని ఐక్యమత్యాన్ని చాటుకున్నాయి. మూగజీవాల పట్ల ఇంత దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.