ఓ రోగికి వైద్యులు ఆపరేషన్ చేస్తున్న సందర్భంలో తీసిన వీడియో కొన్నాళ్ల తరువాత టిక్ టాక్లో వైరల్గా మారి దుమారం రేపింది. హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, ఆయన బృందం ఈ ఆపరేషన్ చేశారు.
ఆపరేషన్ చేస్తూ... తీసిన వీడియో టిక్ టాక్లో రావటం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ పేషెంట్కు ఏమన్నా అయితే బాధ్యత ఎవరిదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్లు రోగుల ప్రాణాలతో చెలగాటమడుతున్నారని మండిపడుతున్నారు. వైద్యుడు శ్రీకాంత్ మాత్రం తనకు ఆ వీడియో టిక్టాక్లో ఎలా వచ్చిందో తెలియదని, ఆపరేషన్ చేసేటప్పుడు వీడియోలు తీయడం సాధారణమేనని అన్నారు.
ఇదీ చూడండి: '300 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందాలపై రేపు సంతకం